టాలీవుడ్ టాప్ హీరోస్ మళ్లీ కలిశారు..!

216
Mahesh Babu
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఈ మధ్య చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒక హీరో మూవీ ఈవెంట్‌కి మరో హీరో గెస్ట్‌గా వెళ్లడం, ఒకరి ఫ్యామిలీతో మరొకరి ఫ్యామిలీ సన్నిహితంగా ఉండటం వంటివి సోషల్ మీడియా సాక్షిగా చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ టాప్ హీరోస్ త్ర‌యం మ‌హేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా క‌లిసి క‌నిపిస్తున్నారు.

పార్టీస్‌లోనో లేదంటే ఏదైన అకేష‌న్‌లోనో ఈ ముగ్గురు హీరోల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఫ్యామిలీస్‌తో క‌లిసి మ‌రీ పార్టీల‌కి హాజ‌ర‌వుతున్న వీరు క‌లిసి ఫోటోల‌కి ఫోజులిస్తున్నారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండడంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోతున్నాయి.

Mahesh, NTR & Charan - Tolly's Best Buddies

ఇక అసలు విషయం ఏంటంటే నిన్న జూలై 27న దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు. తన పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ఓ గ్రాండ్ పార్టీని ఇచ్చారు. ఈ పార్టీకి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ హాజరై అందరినీ మరోసారి ఆశ్చర్యపరిచారు. వంశీపైడిపల్లితో వారు దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ ముగ్గురు హీరోల‌తో క‌లిసి వంశీ పైడిప‌ల్లి మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాన్ని చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం వంశీ- మ‌హేష్ కాంబినేష‌న్‌లో మూవీ రూపొందుతుండ‌గా త్వ‌ర‌లో చెర్రీ- జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్‌గా #RRR మూవీ చేయ‌నున్నారు.

- Advertisement -