ప్రపంచ వ్యాప్తంగా TRS వ్యవస్థాపక దినోత్సవం: మహేష్ బిగాల

83
- Advertisement -

టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే హాజరుకావాలని కోరారు.

ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులు వారి వారి దేశాలలో కోవిడ్‌ నిబంధనలు అనుసరించి ఘనంగా జెండా పండగ నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈసారి పరిమిత ఆహ్వానితులు దృశ్యా 15-20 దేశాల ప్రతినిధులు మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో పాల్గొంటున్నారు అని తెలిపారు.

- Advertisement -