సీరియల్ లో మహేశ్ బాబు..

399
mahesh Babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించి సరిలేరు నీకెవ్వరు చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రంపై పెద్ద ఎత్తున అంచానాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈచిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఉన్న సమాచారం మేరకు మహేశ్ బాబు బుల్లితెరపై కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇది కూడా ఈమూవీ ప్రచారంలో భాగంగానే తెరకెక్కిస్తున్నారట.

జీతెలుగులో ప్రసారమయ్యే తూర్పు పడమర సీరియల్ లో మహేశ్ కనిపించనున్నాడట. ఈ సీరియల్ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ నిన్న రాత్రి తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగిందట. ఈ షూట్ లో మహేష్ తో పాటుగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా పాల్గొన్నాడు. ఈసీరియల్ లో మహేశ్ గెస్ట్ గా వస్తాడా లేదా తూర్పు పడమర నటీనటులతో ముచ్చటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి నేడు మహేశ్ బుల్లితెర ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు.

- Advertisement -