సరిలేరు నీకెవ్వరు…దక్షిణాదిలో మహేశ్ టాప్‌..

191
mahesh babu
- Advertisement -

టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు. ఇటీవలె సరిలేరు నీకెవ్వరు సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ తాజాగా దక్షిణాదిలో తనకు ఎవరు సరిలేరనిపించుకున్నారు.తన నటనతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న మ‌హేష్ సోషల్ మీడియాలో దక్షిణాదిలో ఏ హీరోకు సాధ్యంకానంత ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నారు.

ట్విట్టర్‌లో కోటిమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న తొలి దక్షిణాది హీరోగా నిలిచారు. మహేశ్ తర్వాతి స్ధానంలో 9.1 మిలియన్ల ఫాలోవర్స్‌తో తమిళ కథానాయకుడు ధనుష్‌ రెండోస్థానంలో ఉన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన మహేశ్‌…తన మనసులోని కృతజ్ఞతాభావాన్ని వివరించి చెప్పడానికి 10 మిలియన్ల ధన్యవాదాలు కూడా సరిపోవు. మీ అందరితో వర్చువల్‌గా ఇలా కనెక్ట్ అయినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. 10 మిలియన్ల బలాన్నిచ్చారు అని మ‌హేష్ ట్వీట్ చేశారు మహేష్.

- Advertisement -