ఫుల్ ఖుషి మోడ్ లో మహేష్ ఫ్యాన్స్

211
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఫుల్ క్రేజ్ పెంచుకునే స్టామినా ఉన్న ఏకైక స్టార్ హీరో మహేష్ అంటూ ఫ్యాన్స్ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. కాకపోతే, ఇప్పుడు మహేష్ నుంచి రాబోయే ‘గుంటూరు కారం’ విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్నారు ఆయన అభిమానులు. ప్యాన్ ఇండియా మూవీ గానే గుంటూరు కారం మొదలైనా నార్త్ లో గుంటూరు కారం క్రేజ్ ఎలా ఉంటుందో అనేది వారికి అంతుబట్టడం లేదు. కానీ, రాజమౌళితో మహేష్ బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతుండటం.. మహేష్ బాబుకి బాగా కలిసొస్తుంది అని వారు కూల్ అవుతున్నారు.

అందుకే, మహేష్ బాబు హార్డ్ కొర్ ఫ్యాన్స్ లో ఇప్పుడు ఖుషి మోడ్ కనబడుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు తన తదుపరి చెయ్యబోయే చిత్రం విషయంలో వారు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. కారణం మహేష్ – రాజమౌళి కలయికలో రాబోయే మూవీ పై ఇప్పుడు అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో కూడా చెప్పడం కష్టం. రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఆ రేంజ్ టాక్ తో ఇండియా నుంచి ఓవర్సీస్ బాక్సాఫీసుని అల్లాడించాయి. రాజమౌళి హీరోలను చూపించిన తీరుకి, హీరోయిజం ఎలివేట్ చేసిన విధానానికి అందరి హీరోలు అబ్బుర పడ్డారు.

అందుకే రాజమౌళి, మహేష్ బాబుని కూడా ఓ రేంజ్ లో చూపెడతాడు, మాస్ గా ప్రెజెంట్ చేస్తాడు అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. మహేష్ తో చెయ్యబోయే చిత్రంలో రెగ్యులర్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ లాంటివి లేకుండా ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తానని రాజమౌళి ఎప్పుడో చెప్పాడు. దీనిని బట్టి మహేష్ ని రాజమౌళి అద్భుతంగా చూపిస్తాడు అని మహేష్ ఫాన్స్ డిసైడ్ అవ్వడమే కాదు, ప్రస్తుతం వాళ్ళు హ్యాపీ మోడ్ లోకి వెళుతున్నారు.

Also Read:త్వరలో విశాఖ టూ సింగపూర్‌కి క్రూయిజ్ సేవలు

- Advertisement -