‘గుంటూరు కారం’లో ఆ 45 నిమిషాలే హైలైట్

218
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా నటించిన కొత్త చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ సోషల్‌ మీడియా వేదికగా మాట్లాడారు. ‘ఈ సినిమా ఫసాఫ్ట్‌లో వచ్చే ఫైట్‌ లో ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. ఇక చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం. థియేటర్ల జాబితా ఇంకా ఫైనల్‌ కాలేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. మరి నాగవంశీ చెప్పినట్టు గుంటూరు కారం చివరి 45 నిమిషాలు అద్భుతంగా ఉంటే.. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించినట్టే.

పైగా చాలా గ్యాప్ తర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా ఇది. దీనికితోడు, ఈ సినిమా జ‌న‌వ‌రి 12న సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాబట్టి, అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరోపక్క రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే గుంటూరు కారం ట్రైల‌ర్‌ను ఈ నెల 6న రిలీజ్ చేయ‌బోతున్నారు. మరి ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంటే కలెక్షన్స్ డబుల్ వస్తాయి. అన్నట్టు మేక‌ర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు డేట్‌ ను ఫిక్స్ చేశారు.

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైల‌ర్ లాంచ్ జ‌న‌వ‌రి 6న‌ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు మేక‌ర్స్ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు. మ‌హేష్ బాబు సరసన శ్రీలీల – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే, ఈ సినిమా ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:త్వరలో విశాఖ టూ సింగపూర్‌కి క్రూయిజ్ సేవలు

- Advertisement -