సరోజ్ ఖాన్‌ మృతికి మహేశ్‌ సంతాపం..

168
mahesh
- Advertisement -

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ మృతిపట్ల సూపర్ స్టార్ మహేశ్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. స‌రోజ్ ఖాన్ మ‌ర‌ణ‌వార్త‌తో నా గుండె ప‌గిలింది. రాబోవు త‌రాల‌కి ఆమె స్పూర్తి. ఒక శ‌కం ముగిసింది. స‌రోజ్ ఖాన్ మృతికి నా సంతాపం . కుటుంబ స‌భ్యుల‌కి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

స‌రోజ్ ఖాన్ తెలుగులో బాల‌కృష్ణ‌, చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున‌, మ‌హేష్ వంటి టాప్ హీరోల‌తో క‌లిసి పని చేసింది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ల వంటి స్టార్స్‌కి డ్యాన్స్ నేర్పించిన స‌రోజ్ ఖాన్ 40 ఏళ్ళ కెరియ‌ర్‌లో 2000కి పైగా సినిమాలు చేశారు. ఆమె మృతితో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.

దేవదాస్ సినిమాలోని దోలా రే దోలా , తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ఏక్ దో తీన్ , జబ్ వీ మెట్ సినిమాలోని యే ఇష్క్ హై పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి.

- Advertisement -