మహేశ్-అనిల్ రావిపూడి మూవీలో ఫిదా బ్యూటీ

287
mahesh babu sai pallavi
- Advertisement -

ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కేరళ కుట్టి సాయి పల్లవి. ఆ తర్వాత నాని సరనస ఎంసీఏ మూవీ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో బిజీగా ఉంది. తెలుగులో ఇటివలే శర్వానంద్ సరసన పడిపడి లేచేమనసు మూవీ నటించింది. ఈమూవీ పెద్దగా విజయం సాధించక పోయినా సాయి పల్లవి నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కథ .. కథనాల్లో కొత్తదనం ఉంటేనే సాయిపల్లవి ఏ ప్రాజెక్టుకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనేది టాలీవుడ్ వర్గాల సమాచారం.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం సాయి పల్లవి మహేశ్ బాబు సరసన నటించనుందని సమాచారం. సూపర్ స్టార్ మహేశ్ బాబు యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడట. అయితే మహేశ్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకొవాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఇటివలే ఆమెకి స్టోరీని కూడా వినిపించాడట.

కథలో కొత్త దనం ఉండటంతో సాయి పల్లవి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈమూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడని సమాచారం. ప్రస్తుతం మహేశ్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షీ సినిమా చేస్తున్నాడు. ఈచిత్రం ఎప్రిల్ లో విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు చిత్రయూనిట్. త్వరలోనే అనిల్ రావిపూడి, మహేశ్ కాంబినేషన్ లో వచ్చే మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

- Advertisement -