మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీలకు మంత్రి కేటీఆర్‌ అభినందలు..

98
ktr
- Advertisement -

మహబూబ్‌ నగర్‌ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. వీరిపై పోటీకి నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ చెందిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారి వెంకట్రావు వారిని ఎమ్మెల్సీలుగా అధికారికంగా ప్రకటించారు. కాగా, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అనతరం నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డిలు మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. వారి వెంట క్రీడల శాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌ గౌడ్‌ ఉన్నారు.

- Advertisement -