సీబీఐకి స్వతంత్ర హోదా: మద్రాస్ హైకోర్టు

135
madras high court
- Advertisement -

సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తితో స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది మద్రాస్ హైకోర్టు. ప‌రిమిత వ‌నరుల‌తో అది ద‌ర్యాప్తును చేప‌ట్ట‌లేక‌పోతోద‌ని, న్యాయ‌స్ధానాల ఎదుట సీబీఐ త‌న లోటుపాట్ల‌ను ఏక‌రువు పెట్ట‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంద‌ని జ‌స్టిస ఎన్ కిరుబ‌క‌ర‌న్‌, జ‌స్టిస్ పుగ‌లేందితో కూడిన డివిజ‌న్ బెంచ్ పేర్కొంది.

సీబీఐకి ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ కేటాయింపులు చేప‌ట్టాల‌ని మ‌ద్రాస్ హైకోర్టు న్యాయ‌మూర్తులు కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించారు. డిప్యుటేష‌న్‌పై ఆధార‌ప‌డ‌కుండా సీబీఐ కోసం ప్ర‌త్యేకంగా ప‌నిచేసే అధికారులు ఉండాల‌ని స్ప‌ష్టంచేశారు.

ఎన్నిక‌ల క‌మిష‌న్‌, కాగ్ త‌ర‌హాలో సీబీఐకి విస్తృత అధికారాలు క‌ల్పించేలా చ‌ట్టం తీసుకురావాల‌ని స్ప‌ష్టం చేసింది. సీబీఐకి వ‌న‌రులు, సిబ్బంది ప‌రిమితంగా ఉండ‌టంతో విచార‌ణ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం త‌లెత్తిన‌ప్పుడు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ త‌ట‌ప‌టాయిస్తోంద‌ని పేర్కొంది. నిధులు, సౌక‌ర్యాల లేమి వంటి ప‌లు అవ‌రోధాల‌ను అధిగ‌మిస్తూ సీబీఐ ప‌నిచేస్తోంద‌ని కోర్టు పేర్కొంది.

- Advertisement -