ఇచ్చిన మాటనిలబెట్టుకున్న సీఎం కేసీఆర్…

497
cm kcr
- Advertisement -

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఇటీవల హరితహారం కార్యక్రమం సందర్భంగా ఇచ్చినమాటను నిలబెట్టుకున్నారు సీఎం కేసీఆర్. మాసాయిపేట మండలం ఏర్పాటుచేస్తానని తెలిపిన విధంగా ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లో మాసాయిపేట కొత్త మండలం ఏర్పాటు చేస్తూ నోటిఫికేన్ విడుదల చేసింది. చేగుంట మండలంలోని మూడు, ఎల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలతో మాసాయిపేట మండలం ఏర్పాటు.

చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంషెట్ పల్లి, మాసాయిపేట, రామంతపూర్, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలతో కొత్త మండలం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.నెల రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు ఇవ్వాలని పేర్కొంది.

- Advertisement -