‘మా’ ఎన్నికల పోలింగ్ సమయం పెంపు..

82
- Advertisement -

‘మా’ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగియాల్సి అయింది. అయితే కొన్ని కారణాలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఓటింగ్‌కు సకాలంలో రాలేకపోయిన వారి కోసం పోలింగ్ అధికారులు మరి కొంత సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 491 మంది నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ నేపథ్యంలో మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడింగించినట్టు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు ట్వీట్ ద్వారా తెలిపారు. వీలైనంత త్వరగా వచ్చి తమ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటు విలువైనదేనని మంచు విష్ణు స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మీ, పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మురళీ మోహన్, హేమ, బెనర్జీ, బండ్ల గణేశ్, జీవితా రాజశేఖర్, అల్లరి నరేష్, సుమన్, పోసాని కృష్ణ మురళి, సాయి కుమార్, వడ్డే నవీన్, శ్రీకాంత్, వీ కే నరేశ్, శివ బాలాజీ, ఉత్తేజ్, జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, నాగార్జున, జయప్రద సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఉన్నారు.

- Advertisement -