సెప్టెంబర్‌ 12న ‘మా’ ఎన్నికలు..

107
Krishnam-Raju
- Advertisement -

ఎట్టకేలకు మా ఎన్నికల తేది ఫైనల్ అయింది. మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కృష్ణంరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 22న మా జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించనుండగా సెప్టెంబర్‌ 12న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

మా కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియక ముందే ఎన్నికల పోరు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. పోటీకి సిద్ధమంటూ ప్రకాశ్‌ రాజ్, మంచు విష్ణుతో పాటు జీవిత రాజశేఖర్ ప్రకటించడమే కాదు నోటికి పనిచెప్పారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగారు. కార్యవర్గ సభ్యులు మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు.దీంతో ఆయన రంగంలోకి దిగి సమావేశం నిర్వహించారు. ఇక ఆగస్టు 22న జరగనున్న జనరల్ బాడీ సమావేశంలో మా ఎన్నికల్లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మా అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎవరికి వారు ప్యానెల్‌ ఏర్పాటు చేసుకుంటూ.. సీనియర్ల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.

- Advertisement -