టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ సినిమాలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుండి ‘మ.. మ.. మహేషా’ అనే ఫుల్ వీడియో సాంగ్ను యూట్యూబ్లో వదిలారు.
శ్రీకృష్ణ, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటలో మహేష్, కీర్తి సురేష్ డ్యాన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవలే విడుదలైన మురారి వా, పెన్నీ వీడియో సాంగ్స్ మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకున్నాయి. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించగా.. సాంగ్స్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్లో నిలిచాయి.
పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో పే పర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే జూన్23 నుండి ప్రైమ్ సబ్స్క్రైబర్లకు ఈ చిత్రం ఉచితంగా అందుబాటులోకి రానుంది.