అగ్నిపథ్.. మెట్రో రైల్ రద్దు..

59
metro
- Advertisement -

దేశవ్యాస్తంగా అగ్నిపథ్ వివాదం కొనసాగుతోంది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన చేపట్టారు. దీంతో సికింద్రాబాద్‌ పరిసరాలు హింసాత్మకంగా మారాయి. ఉదయం నుంచి రైల్వే స్టేషన్‌లో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో ఈరోజు పలు రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

మరోవైపు ముందు జాగ్రత్తగా మెట్రో రైల్ సర్వీసులను కూడా నిలిపి వేస్తున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. తదుపరి సమాచారం ఇచ్చే వరకూ మూడు లైన్లలోని అన్ని మెట్రో రైళ్లను నడపబోమని తెలిపింది.ఈ మేరకు రైల్ సంస్థ ట్విట్టర్‌ ద్వారా అధికారిక ప్రకటన జారీ చేసింది.

- Advertisement -