LS Elections:ఓటేసిన ప్రముఖులు

2
- Advertisement -

దేశవ్యాప్తంగా మూడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండే ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తిచూపిస్తున్నారు.సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు క్యూలో నిల్చొని ఓటు వేశారు.

గుజరాత్‌లో ఉదయమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్‌ షా ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

వీరితో పాటు పలువురు ప్రముఖులు ఓటేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ విదిశ లోక్‌సభ అభ్యర్థి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర మంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, ప్రహ్లాద్‌ జోషీ, జ్యోతిరాదిత్య సింధియా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Also Read:డైరెక్టర్ సుకుమార్ @ 20

- Advertisement -