వరద సాయం కోసం మీసేవ సెంటర్లకు రావొద్దు..

297
lokesh
- Advertisement -

వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు.

జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని బాధితుల వివరాలు సేకరిస్తున్నాయని చెప్పారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని, తర్వాత వారి అకౌంట్‌లోనే నేరుగా వరద సాయం డబ్బులు జమవుతాయని చెప్పారు.

ఈ నెల 7వ తేదీ నుంచి వరద సహాయం మళ్లీ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు 8 గంటల నుంచే మీ సేవకు ప్రజలు క్యూ కట్టారు.

- Advertisement -