నవంబర్ 17న అఖిలపక్ష నేతలతో లోక్‌సభ స్పీకర్ భేటీ

366
om Birla
- Advertisement -

నవంబర్ 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో నవంబర్ 17న అఖిలపక్ష సమావేశం నిర్వహిచనున్నారు. దానికి సంబంధించి అన్ని పార్టీలకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.

20 రోజుల పాటు పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉంటాయ‌ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, ఆర్థిక మంద‌గ‌మ‌నం లాంటి అంశాల‌ను స‌మావేశాల్లో లేవ‌నెత్తేందుకు ప్ర‌తిప‌క్షాలు సిద్ధంగా ఉన్నాయి.

- Advertisement -