పశ్చిమ బెంగాల్‌లో పూర్తి లాక్‌డౌన్..

180
- Advertisement -

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మే 16 ఆదివారం నుంచి మే 30 వరకు పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ఈనెల 16 నుంచి రెండు వారాల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. లాక్ డౌన్ సమయంలో అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు, కోల్ కతా మెట్రో సహా రవాణా సర్వీసులు కూడా నిలిచిపోతాయని వెల్లడించింది. కేవలం అత్యవసర సర్వీసులకే అనుమతి ఉంటుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బందోపాధ్యాయ్ పేర్కొన్నారు.

నిత్యావసరాల దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు.పెట్రోల్ పంపులకు ఇదే తరహా అనుమతులు వర్తిస్తాయని నోటిఫికేషన్ లో వివరించారు. బ్యాంకులు మాత్రం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకలాపాలు సాగిస్తాయని పేర్కొన్నారు.

- Advertisement -