స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్..

411
Trs New Mlcs
- Advertisement -

స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. వరంగల్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపోందారు. వరంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్ధికి 850ఓట్లు పడగా.. కాంగ్రెస్ అభ్యర్ధికి కేవలం 23 ఓట్లు మాత్రమే వచ్చాయి. 827ఓట్ల ఆధిక్యంలో పొచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు.

ఇక నల్లగొండ నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి లక్మీపై చిన్నపరెడ్డి విజయం సాధించారు. నల్గొండలో టీఆర్ఎస్ కు 640 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 433 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్ధి చిన్నపరెడ్డి 213ఓట్లతో ఘన విజయం సాధించారు.

ఇక రంగారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మురి ప్రతాప్ రెడ్డి పై ఆయన ఘన విజయం సాధించారు. రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ మూడు ఎమ్మెల్సీ స్ధానాలు టీఆర్ఎస్ అభ్యర్దులు ఘన విజయం సాధించారు.

- Advertisement -