ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించాలి- సీఎం

415
kcr
- Advertisement -

దేశం నుండి కరోనాను తరిమికొడుతున్నామన్న ఐక్యతను చూపించేందుకు దీపాలు వెలిగించాల ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇంట్లోని విద్యుత్తు దీపాలు ఆర్పేసి బాల్కనీలోకి రావాలని.. లైట్ ఉంటే లైట్, కొవ్వొత్తి ఉంటే కొవ్వొత్తి, ఫోన్ ఉంటే ఫ్లాష్ లైట్ వెలగించాలన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5 నెల రాత్రి 9 గంటలకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తోన్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

- Advertisement -