కేజ్రీవాల్‌కు షాకిచ్చిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్!

68
kejriwal
- Advertisement -

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాకిచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. కేజ్రీవాల్ తీసుకొచ్చిన వివాదాస్ప‌ద ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ నివేదిక ఆధారంగా ఎల్‌జీ ఈ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

2021-22లో లిక్క‌ర్ లైసెన్సుదారుల‌కు అనుచిత ప్ర‌యోజ‌నాలు వ‌ర్తింపచేయ‌డంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్, ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ల‌కు పంపిన నివేదిక అనంత‌రం ఎల్‌జీ మ‌ద్యం పాల‌సీపై సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

ఎక్సైజ్ శాఖ‌కు ఇన్‌చార్జ్ మంత్రిగా మ‌నీష్ సిసోడియా వ్య‌వ‌హ‌రించిన క్ర‌మంలో ఉన్న‌త రాజ‌కీయ స్ధాయిలో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ నోటిఫైడ్ ఎక్సైజ్ పాల‌సీకి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ న‌ష్టం వాటిల్లింద‌ని నివేదిక పేర్కొంది. దీనిపై అనేక విమర్శలు వచ్చిన కేజ్రీ సర్కార్ తగ్గలేదు. ఇప్పుడు అదే వివాదానికి కారణమైంది.

- Advertisement -