సీఎం కేసీఆర్‌ సభకు ముస్తాబవుతున్న ఎల్బీ స్టేడియం…

222
- Advertisement -

సీఎం కేసీఆర్‌ సభకు ముస్తాభవుతోంది ఎల్బీ స్టేడియం. ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ గ్రేటర్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్..ఒకే ఒక సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సారి కూడా ఎల్బీస్టేడియంలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు.

గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్ల నుండి భారీగా ప్రజలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించారు మంత్రి కేటీఆర్.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్‌లు,శానిటైజర్‌లు తప్పనిసరి అని టీఆర్ఎస్ నేతలు సూచించారు. కరోనా జాగ్రత్తల మధ్య బహిరంగసభ జరుగుతుందని గులాబీ నేతలు చెబుతున్నారు.

- Advertisement -