మొక్కలు నాటిన నటి లావణ్య త్రిపాఠి..

215
lavanya
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతోంది. దీని లో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులు కుతూహలంతో ముందుకు రావడం జరుగుతుంది.

ఈరోజు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇచ్చిన స్వీకరించి నేడు సహస్త్రధర; ఉత్తరాఖండ్ లో తన స్నేహితులు; కుటుంబ సభ్యులతో కలిసి 50 మొక్కలను నాటిన ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో సోషల్ మీడియాలో తెలపడం జరిగింది.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మా అందరి చేత మొక్కలు పెట్టిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇదేవిధంగా కొనసాగాలని కోరారు. ఈ సందర్భంగా తను 1)రీతు వర్మ హీరోయిన్ ;2) కార్తికేయ హీరో 3) వెన్నెల కిషోర్ నటుడు; 4) సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి 5)అనిత రెడ్డి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -