లొంగిపోయిన లాలూ..

244
Lalu Yadav
- Advertisement -

బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేడు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట లొంగిపోయారు. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలడంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు లాలూ. అయితే వైద్యపరమైన కారణాలతో మే 11న లాలూకు ఆరు వారాల ప్రాధమిక బెయిల్‌ను మంజూరు చేసిన హైకోర్టు ఆ తర్వాత పలు సందర్భాల్లో ఆగస్ట్‌ 27 వరకూ పొడిగించింది.

Lalu Yadavకాగా..వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆసియన్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ (ముంబై) వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిస్తారని లాలూ న్యాయవాది ప్రభాత్‌ కుమార్‌ వెల్లడించారు. గడువు ముగియడంతో జార్ఖండ్‌ హైకోర్టు లాలూను త్వరగా ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ముంబైలో మూడు వారాల పాటు వైద్య చికిత్సలు పొందిన లాలూ శనివారం అక్కడినుంచి పట్నా చేరుకున్నారు. లాలూ ప్రాధమిక బెయిల్‌ను పొడిగించేందుకు నిరాకరించిన జార్ఖండ్‌ హైకోర్టు ఆగస్ట్‌ 30లోగా సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని కోరింది.

మరోవైపు రాంచీ విమానాశ్రమయంలో పార్టీ అనుచరులతో కలిసి వెలుపలికి వచ్చిన లాలూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తన ఆరోగ్యం బాగాలేదని, తానిప్పుడు మాట్లాడేదేమీ లేదని తెలిపారు.

- Advertisement -