TTD:9న‌ అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

32
- Advertisement -

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 10 నుండి 18వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 9వ తేదీ గురువారం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

ఆలయంలో న‌వంబ‌రు 10న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.10 నుండి 9.30 గంటల మ‌ధ్య ధనుర్ ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తిరోజూ ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.

Also Read:టీమిండియాకు హెచ్చరికలు..!

వాహనసేవల వివరాలు :

10-11-2023 – ధ్వజారోహణం, చిన్నశేషవాహనం.

11-11-2023 – పెద్దశేషవాహనం, హంసవాహనం.

12-11-2023 – ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం.

13-11-2023- కల్పవృక్ష వాహనం, హనుమంతవాహనం.

14-11-2023 – పల్లకీ ఉత్సవం, వ‌సంతోత్స‌వం, గజవాహనం.

15-11-2023- స‌ర్వ‌భూపాల వాహ‌నం, స్వర్ణరథం, గరుడవాహనం.

16-11-2023- సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం.

17-11-2023 – రథోత్సవం, అశ్వ వాహనం.

18-11-2023- పంచమితీర్థం, ధ్వజావరోహణం.

- Advertisement -