మునుగోడులో టీఆర్‌ఎస్‌కు కుమ్మరి సంఘం మద్దతు

105
trs
- Advertisement -

త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది రాష్ట్ర కుమ్మరి సంఘం. ఈ నేమరకు మంత్రి జగదీష్ రెడ్డితో కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావు ఆధ్వర్యంలో సంఘం నేతలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. అటువంటి మహానేత ను గౌరవించాల్సిన బాధ్యత తమ సంఘంపై ఉందన్నారు. ఇందులోభాగంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై కుమ్మరి వృత్తిదారులకు శిక్షణ ఇప్పించడంతో ఉపాధికి గ్యారెంటీ లభించిందని చెప్పారు. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ ఎంతో ఉందని వారు కొనియాడారు.

- Advertisement -