నామినేటెడ్ ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్..

212
ktr
- Advertisement -

నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్ర‌జాక‌వి గోరెటి వెంక‌న్న‌, బ‌స్వ‌రాజు సార‌య్య‌, బొగ్గార‌పు ద‌యానంద్‌కు రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌ల‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్‌ స్పందిస్తూ.. తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది. గుర్రం జాషువా, బోయి భీమన్న వంటి సాహితీ దిగ్గజాలు పూర్వం శాసనమండలి సభ్యులుగా సేవలందించారు. పాటకు పట్టం కట్టి, ప్రజాకవి గోరెటి వెంకన్నను సమున్నత పదవితో సత్కరించిన సీఎం కేసీఆర్‌కు వందనాలు తెలిపారు మంత్రి కేటీర్.

అదే విధంగా అత్యంత వెనుకబడిన రజక సామాజిక వర్గం నుండి ప్రజానేతగా ఎదిగిన బస్వరాజు సారయ్య, ప్రముఖ సంఘసేవకులు,ఆర్యవైశ్య ప్రతినిధి భోగారపు దయానంద్ ఎమ్మెల్సీలుగా ఎంపికైన సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు.

- Advertisement -