- Advertisement -
పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది అని తెలిపారు.
తన పాంచ్ న్యాయ్లో పార్టీ మారిన ఎమ్మెల్యేను అనర్హులుగా పరిగణిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. రాహుల్ గాంధీ మరియు ఆయన పార్టీ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి స్పీకర్ పదవిని ఉపయోగించరని నేను ఆశిస్తున్నాను అని ఎక్స్ వేదికగా తెలిపారు.
ఈ మూడు నెలల సమయంలో 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికల కోసం మేము మా పని మొదలుపెడతాం అని వెల్లడించారు.

Also Read:రూ.5కే బ్రేక్ ఫాస్ట్.. ఎప్పటినుండి అంటే!
- Advertisement -

