మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కేటీఆర్‌

285
KTR Visits Wastewater Treatment Plant
- Advertisement -

ఈ రోజు నెక్లెస్ రోడ్డులోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పరిశీలించారు. ఈ మురుగునీటి శుద్ధి కేంద్రం నుంచి శుద్ధి అయిన తర్వాత నీరు హుస్సేన్సాగర్‌లోకి వెళ్తుంది. ఇందులో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రంలో శుద్ధమైన మురికినీటి నమూనాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.

KTR Visits Wastewater Treatment Plant

ప్రస్తుతం ఇక్కడి నుంచి మురుగునీరు సిద్ధమవుతున్న తీరును పరిశీలించి మంత్రి కేటీఆర్ అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. మంత్రి కేటీఆర్ వెంట నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మరియు హెచ్ఎండిఎ ఉన్నత అధికారులు ఉన్నారు.

- Advertisement -