కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్..

294
minister ktr
- Advertisement -

మంగళవారం రాష్ట్ర‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూర్యపేట జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. కాగా, ఈరోజు భారత్‌-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమ‌రుడైన‌ కర్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని సూర్యాపేట‌లో ఆవిష్క‌రించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్‌ సంతోష్‌ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్‌ ఈ పర్యటనలో ఇంటిగ్రేడెడ్ మార్కెట్ అదనపు భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి,రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్ లు,డీడీసీబీ చైర్మన్ లు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి లు,మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కల్నల్ సంతోష్ బాబు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి అప్పుడే సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నాం. చాలా గొప్పగా, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలా కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యత్భుతం. మనందరికీ గర్వకారణం. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఇచ్చిన గౌరవం, సముచిత స్థానం భారత సైన్యం మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చింది. స్ఫూర్తివంతమైన,ఆదర్శప్రాయమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ దార్శనికతతో 18 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించారు. చేనేత రంగాన్ని ఆదుకున్న గొప్ప వ్యక్తి కేటీఆర్‌. తెలంగాణ ఆశా కిరణం ,భవిష్యత్తు కేటీఆర్‌ అని.. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దారు కొనియాడారు. ఇక కల్నల్ సంతోష్ బాబు లాంటి గొప్ప వ్యక్తిని కన్న వారి తల్లిదండ్రులు దేవుళ్ళు.చావు అందరికి వస్తుంది కానీ, సంతోష్ బాబు లాగా సింహం లాగా, సమున్నతంగా ఉండాలి.ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి అన్ని వేళలా అండగా వున్నారు. కొండంత భరోసాను ఇచ్చారు. ఈ రోజు సంతోష్ బాబు వర్ధంతి,ఈ రోజు ఆయన విగ్రహాన్నీ కేటీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా..గర్వంగా ఉన్నదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

సంతోష్ బాబు సతీమణి సంతోషిని మాట్లాడుతూ.. భారత్ చైనా సరిహద్దుల్లో మా భర్త సంతోష్ బాబు వీర మరణం చెందారు. అనుక్షణం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్‌, జగదీష్ రెడ్డి ప్రతి ఒక్కరు అండగా వున్నారు. సముచిత గౌరవాన్ని ఇచ్చారు. నా పిల్లల భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చారు. నాకు గౌరవ ప్రదమైన ఉద్యోగం కల్పించారు. ముఖ్యంగా మంత్రి జగదీష్ రెడ్డి మాకు అన్ని వేళలా అండగా ఉంటూ ధైర్యం అందించారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌ జగదీష్‌ రెడ్డిగార్లకు కృతజ్ఞతలు తెలిపారు సంతోషి.

- Advertisement -