జర్నలిస్టులను అవమానించడం సరికాదు:కేటీఆర్

99
ktr minister
- Advertisement -

జర్నలిస్టులను అవమానించడం సరికాదని…సోష‌ల్ మీడియా సాధ‌నాలు సామాజిక వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు వేదిక‌లుగా మార‌డం దారుణ‌మ‌ని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు కేటీఆర్. జ‌ర్న‌లిస్టుల‌ను వేధిస్తున్న ఆ దుర్మార్గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని కేటీఆర్ కోరారు.

తుల‌సి చందు అనే మ‌హిళా జ‌ర్న‌లిస్టు త‌న‌కు జ‌రుగుతున్న అవ‌మానాన్ని కేటీఆర్ దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకెళ్లారు. తాను మ‌హిళా జ‌ర్న‌లిస్ట్‌ను కాబ‌ట్టి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో వేధిస్తున్నార‌ని …ప్ర‌శ్నిస్తున్న జ‌ర్న‌లిస్టుల‌ను ఏకంగా యాక్సిడెంట్ చేస్తారంట అని ర్కొన్నారు. ఇప్ప‌టికైనా త‌మ‌ను బెదిరిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరాగా కేటీఆర్ సైతం సీరియస్‌గా స్పందించారు.

- Advertisement -