ప్రజా డిమాండ్‌..గ్రేటర్‌లో కంటోన్మెంట్ వీలినం

74
ktr
- Advertisement -

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను విలీనం చేయాల‌న్న ప్రజా డిమాండ్‌పై స్పందించారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను విలీనం చేయాల‌ని చాలా మంది ప్ర‌జ‌లు కోరుతున్నారు. విలీనం చేయాల‌న్న వాద‌న‌ల‌తో నేను కూడా ఏకీభ‌విస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాల‌ను చెప్పండి అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీనిపై నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తోంది. కేటీఆర్‌ ట్వీట్‌ని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు స్పందిస్తున్నారు.

దీనిపై నెటిజ‌న్లు త‌మ అభిప్రాయాల‌ను రిప్లై రూపంలో తెలుపుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను విలీనం చేయాల‌న్న సూచ‌న‌లు స‌రైన‌వేన‌ని చెబుతున్నారు. విలీనం చేస్తే బాగుంటుంద‌ని కోరుతున్నారు.

- Advertisement -