టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శులతో కేటీఆర్ భేటీ..

124
ktr ts bhavan
- Advertisement -

తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ కానున్నారు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా సదుపాయం వంటి అంశాలపై చర్చించనున్నారు.

అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విపక్షాల తీరుపై స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై కేటీఆర్ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ప్రధానకార్యదర్శకుల సమాచారం వెళ్లింది.

- Advertisement -