ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండ‌గా టీఆర్‌ఎస్‌- కేటీఆర్

141
ktr
- Advertisement -

ప్రతీ కార్యకర్త కుటుంబానికి టీఆర్‌ఎస్‌ పార్టీ అండ‌గా ఉంటుందని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన వివిధ ప్ర‌మాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు బీమా సాయం అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 80 మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల బీమా సాయం అందించి, వారిలో మ‌నో ధైర్యాన్ని నింపారు. అనంతరం ఆయన చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో 60 ల‌క్ష‌ల పైచిలుకు కుటుంబ స‌భ్యుల‌ను క‌లిగిన అజేయ‌మైన శ‌క్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగింది. వీరంద‌రిని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని… వారికి త‌ప్ప‌కుండా పార్టీ అండ‌గా ఉంటుంద‌ని కేటీఆర్ తెలపారు. తెలంగాణ భ‌వ‌న్‌కు వ‌చ్చిన 80 మంది కుటుంబ స‌భ్యుల‌కు హృద‌య‌పూర్వక న‌మ‌స్కారాలు తెలియజేశారు.

మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భ‌ర్త‌, సోద‌రుడు, కుమారుడు ఎవ‌రైనా కావొచ్చు.. వివిధ ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించారు. అలాంటి కుటుంబాల‌కు పార్టీ అండ‌గా ఉంటుంది. కేసీఆర్ అండ‌గా ఉంటున్నారు. ఈ కుటుంబాల స్థితిగ‌తుల‌ను పార్టీ నాయ‌కులు అడిగి తెలుసుకున్నారు. మాకు ఇల్లు లేదు అని కొంత‌మంది.. పిల్ల‌లు చిన్న‌వారు ఉన్నారు.. గురుకులాల్లో అడ్మిష‌న్స్ క‌ల్పించాల‌ని కోరారు. చ‌ద‌వుకున్న అమ్మాయిలు ఉన్నారు.. త‌మ‌కేదైనా ఉద్యోగం ఇప్పించాల‌ని కోరారు. చ‌నిపోయిన త‌ర్వాత పెన్ష‌న్ రావ‌ట్లేద‌ని తెలిపారు. మీ అంద‌రికీ తాము అండ‌గా ఉన్నాం. రాబోయే ప‌దిహేను రోజుల్లో మీరు అడిగిన ప‌నులు చేసిపెట్టే బాధ్య‌త త‌మ‌దే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

18 కోట్ల పైచిలుకు రూపాయాల‌ను ఇన్సూరెన్స్ క‌డుతున్నామ‌ని చెప్పారు. 950 మంది పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వివిధ ప్ర‌మాదాల్లో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ కుటుంబాల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్య‌త పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీల‌తో పాటు ఎమ్మెల్యేలదే అని తెలిపారు. వీరంద‌రికి త్వ‌ర‌లోనే సాయం చేస్తామ‌న్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌నంద‌రం ముందుకు పోదామ‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -