ఆర్థిక వృద్ధిలో అగ్రస్ధానంలో తెలంగాణ: కేటీఆర్

492
ktr
- Advertisement -

ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్ధానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరై అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ టీఎస్‌ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. చిన్న ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయన్నారు.రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

యువతకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని… ప్రైవేటు సెక్టార్‌లోనే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో ఐ టి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ సీఐఐ చైర్మన్ డి.రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -