పారిశుధ్య నిర్వహణలో హైదరాబాద్ భేష్‌..

166
ktr
- Advertisement -

ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్మాణ వ్యర్థాలు తరలించే ఆధునిక (కాంప్యాక్టర్‌) స్వచ్ఛ వాహనాలను, సంజీవయ్యపార్కు వద్ద ఆధునిక చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉద‌యం ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డు వద్ద మంత్రి కేటీఆర్ జెండా ఊపి స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…హైద‌రాబాద్‌లో పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌ను మెరుగుప‌రిచామ‌ని తెలిపారు. న‌గ‌రంతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా ఇంటింటి నుంచి చెత్త సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం 2వేల స్వ‌చ్ఛ ఆటోల ద్వారా చెత్త‌ను సేక‌రిస్తున్నామ‌ని చెప్పారు.

న‌గ‌రంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చెత్త వేయ‌కుండా ఉండేందుకే సేక‌ర‌ణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా ఎద‌గాలంటే.. అన్ని ర‌కాల హంగులు ఉండాలి….నేరాలు త‌గ్గాలి…పారిశుద్ధ్యం మెరుగుప‌డాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

- Advertisement -