బిహార్‌ ప్రజలు మంచికోసం ఎదురుచూస్తున్నారు:సోనూసూద్

160
sonu
- Advertisement -

బిహార్ ప్రజలు మంచి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు సినీ నటుడు సోనూసూద్. బిహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సోనూ…ఈ దేశ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటారు. ఆ క్ర‌మంలోనే బీహార్‌లో ఎన్డీయేకు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారని తెలిపారు.

బీహార్‌లో ఎవ‌రు గెలిచింద‌నేది ముఖ్యం కాదు.. ఐదేళ్ల త‌ర్వాత అక్క‌డి ప్ర‌జ‌ల జీవ‌న స్థితిగ‌తులు మారాయా? లేదా అన్న‌ది ముఖ్యం అని సోనూసూద్ పేర్కొన్నారు. త‌మ జీవితాలు ఇంకా మెరుగు అవ్వాల‌నే ఉద్దేశంతోనే ఈ అవ‌కాశం ఇచ్చి ఉండొచ్చు. ఈ ప్ర‌భుత్వాన్ని తాము ఎంచుకున్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని ఐదేళ్ల త‌ర్వాత ప్ర‌జ‌లు అనుకుంటారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

- Advertisement -