KTR:బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే హీరోలు

14
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే హీరోలన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..నేటితో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయన్నారు. కార్యకర్తల వల్లే ఇన్నేళ్ళుగా పార్టీ బలంగా ఉందని, గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారన్నారు. నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని..ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదన్నారు.

ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని..సూర్యాపేటలో మాత్రమే గెలిచాం అన్నారు. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు…
ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఈ పార్లమెంటు సన్నాహాక సమావేశాలు ఆరంభం మాత్రమేనని…ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయన్నారు.
సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పికొట్టలేకపోయాం అని…అవతలి వాళ్లు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు.

మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారని..కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగన లేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారని…హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టె ప్రయత్నం చేస్తోదన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని..కార్యకర్తలు ఉదాసీన వైఖరి మీమాంస వీడాలి.. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు. ఇపుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలన్నారు.

కోమటి రెడ్డి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని..నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపండన్నారు. సాగర్ ఆయకట్టు కు కాంగ్రెస్ పాలన లో మొదటి సారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందని…కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందన్నారు. శ్రీ రాం సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండ బెడుతోందని…కరెంటు కోతలు అపుడే మొదలు అయ్యాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడిందని..రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోడీ బీఆర్ఎస్ ను కాలుస్తారట ఆలోచించాలన్నారు.

మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ బీజేపి అక్రమ సంబంధం గురించి చెప్పాలని…రాహుల్ అదానీని దొంగ అన్నారు రేవంత్ దొర అంటున్నాడన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని…కాంగ్రెస్ కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయన్నారు. నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టి గా పనిచేసి గెలుద్దాం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Also Read:Modi:రామరాజ్యం ప్రారంభమైంది

- Advertisement -