రూ.15లక్షలు వస్తే బీజేపీకి.. రాకుంటే కారుకు ఓటేయ్యండి..

213
ktr speech
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ కేటీఆర్‌ మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు అనగానే ఢిల్లీ నుండి డజన్ల కొద్దీ నాయకులు పరుగెత్తుకుని వస్తున్నారు.. వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు హైదరాబాద్‌ వైపు కన్నెత్తి చూడలేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం కంటోన్మెంట్‌లో రోడ్ల సమస్యలు పరిష్కరించలేదు. మేం కొత్తగా రోడ్లు వేస్తుంటే కేంద్రం కంటోన్మెంట్‌ రోడ్లను మూసివేసింది. రోడ్లు వేసేటోళ్లకు ఓట్లేస్తరా..రోడ్లు మూసేటోళ్లకు ఓట్లేస్తరో ఆలోచించాలి. పొలిటికల్‌ టూరిస్టులతో హైదరాబాద్‌ నగరానికి ఒరిగేది ఏమీలేదని కేటీఆర్‌ ఎద్దేవ చేశారు.

డిసెంబర్‌ 4 తర్వాత రూ.10వేలు వరదసాయం ఇస్తాం. సీఎం కేసీఆర్‌ వరద సాయం చేస్తుంటే..బీజేపీ నేతలు అడ్డుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో రూ.15లక్షలు ఇస్తామన్నారు. రూ.15లక్షలు వస్తే బీజేపీకి.. రాకుంటే కారుకు ఓటేయ్యండి అని కేటీఆర్‌ కోరారు. హైదరాబాద్‌ ప్రజలకు 50శాతం ఇంటిపన్ను రాయితీ ఇచ్చాం. శాంతిభద్రతల కోసం గల్లీగల్లీకి 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వస్తే మనకే నష్టం. మతం పేరుతో చిచ్చు పెట్టేవాళ్లు కావాలా..? జనహితం కోరుకునేవాళ్లు కావాలా? తేల్చుకోవాలని’ కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -