మోదీకి నోబెల్ ఇవ్వాలి: కేటీఆర్ ట్వీట్

166
ktr
- Advertisement -

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. కరోనా కాలంలో ఎంతో కష్టపడి మందు కనుగోన్న మోదీకి నోబెల్‌ బహుమతి ప్రధానం చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై వ్యంగంగా ట్వీట్‌ చేశారు.

మోదీ జీకి మెడిసిన్‌ లేదా సైన్స్‌లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ కొవిడ్ వ్యాక్సిన్‌ను కనుగొన్నాడని మోదీ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. మోదీ కేబినెట్ మిత్రులందరూ చాలా తెలివిమంతులు.. ఇది అంగీకరించాల్సిన విషయమన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి తెలివిమంతుడు అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను మన దేశంలో మోదీనే కనుగొన్నాడని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన వీడియోను కేటీఆర్ ట్వీటర్‌ ద్వారా షేర్‌ చేశారు

- Advertisement -