ఆహాలో పవన్‌ షో కోసం ప్రేక్షకుల నిరీక్షణ

178
- Advertisement -

బాలయ్య, పవన్‌, త్రివిక్రమ్‌ కలిసి ఓ మెగా భారీ ప్రాజెక్ట్‌లో సినిమా వస్తుందన్నుకుంటున్నారా… కాదు ఈ ముగ్గురు కలిసి ఓ షోలో సందడి చేయాలని భావిస్తున్నారు. మనందరికి తెలిసిన ఆహా ప్లాట్‌ఫామ్‌లో బాలయ్య చేసిన ఆన్‌స్టాపబుల్‌2 లో తొలి ఎపిసోడ్‌ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడం వల్ల ఈ షోకి మరింత ఆదరణ పెరిగింది. దీంతో అల్లు ఆరవింద్‌ ,జూపల్లి రామేశ్వర్‌ చాలా సంతోషంగా ఉన్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం. అయితే సినిమా మార్కెట్‌పై మంచి కమాండ్‌ ఉన్న బాలయ్య, అరవింద్‌… ఈ షో కోసం ఎవరినైనా పిలవవచ్చు అని టాలీవుడ్‌ టాక్‌.

 బాలయ్య రెండవ కూమార్తె తేజస్విని ఈ షోని కోఆర్డినేట్‌ చేస్తున్నారని అందుకే ఈ స్థాయిలో ప్రజల నుంచి రెస్సాన్స్‌ వస్తుందని అని అంటున్నారు. లేటెస్ట్‌ ఏంటంటే.. ప్రస్తుతం నెంబర్‌ వన్‌లో ఉన్న ఈ షో కోసం చిరంజీవిని కూడా సంప్రదిస్తున్నారని టాలీవుడ్‌ టాక్‌. ఇదే జరిగితే ఆహా షోని పాన్‌ ఇండియా షోగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఆఖండ, ఆహాలతో బాలయ్య భవిష్యత్తును మార్చేసిందంటున్నారు సినీ ప్రముఖులు. బాలయ్య క్రాక్‌ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. బాలయ్య కూమార్తె త్వరలో నిర్మాతగా మారనుందని టాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం బాలయ్య వద్ద బోయపాటి శ్రీను, రాజమౌళి, పూరి జగన్నాథ్‌ల కథలు ఉన్నాయని…వీటిలో ఏది సెలెక్ట్‌ చేసుకుంటారో వేచిచూడాల్సిందే.

- Advertisement -