వారిని స్వదేశానికి తీసుకురండి..కేంద్రమంత్రులకు కేటీఆర్ ట్వీట్

366
ktr
- Advertisement -

కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన మన దేశ విద్యార్దులను స్వదేశానికి తీసుకురావాలని కేంద్రమంత్రులు జైశంకర్, హర్దిప్ పూరీక్ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. మన దేశానికి చెందిన విద్యార్దులు మనీలా, కౌలాలంపూర్‌, రోమ్‌లోని విమానాశ్రయాల్లో్ చిక్కుకుపోయిన భారతీయుల నుంచి తనకు మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. వారి పరిస్థితుల గురించి వెంటనే స్పందించి, వారిని స్వదేశానికి తీసుకురావాలని తాను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.

కౌలాలంపూర్‌, మనీలా విమానాశ్రయంలో రెండు రోజులుగా తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా దృష్ట్యా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చే విమానాలను నిలిపివేశారు. అధికారులు స్పందించక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ktr tweet

- Advertisement -