వాగులో టీఆర్ఎస్‌ నేత గల్లంతు…స్పందించిన మంత్రి కేటీఆర్

270
ktr
- Advertisement -

రాజన్న సిరిజిల్ల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ గల్లంతైన ఘటనపై స్పందించారు మంత్రి కేటీఆర్. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్…గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిద్దిపేట ఆర్డీవో సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ల‌పల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, తన ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండ‌గా.. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో స‌హా వాగులో ప‌డిపోయారు. స్థానికులు వెంటనే గమనించి ముగ్గురిని బయటకు తీయగా… కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యారు.

- Advertisement -