కేబీసీలో మంత్రి కేటీఆర్ ప్రశ్న

165
kbc
- Advertisement -

కౌన్ బనేగా కరోడ్ పతి…బుల్లితెరపై పాపులర్ రియాల్టీ షో. ఇప్పటివరకు 12 సీజన్స్ పూర్తిచేసుకోగా 13వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షోకు హోస్ట్‌గా బిగ్ బీ అమితాబ్‌ వ్యవహరిస్తుండగా బీసీసీఐ చీఫ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారికి 40,000లు వచ్చే ప్రశ్నగా మంత్రి కేటీఆర్ అడిగిన ట్వీట్‌ని ఇచ్చారు బిగ్ బి. కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ లిస్ట్ను ట్వీట్ చేస్తూ వీటిని సరిగ్గా పలికే వారున్నారా ? అంటూ దీనిని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శ‌శి ధ‌రూర్‌ని ట్యాగ్‌ చేశారు. ఇప్పుడు ఈ ట్వీటే కేబీలో ప్రశ్నగా మారింది. కేటీఆర్ ఈ ట్విట్‌ను ఎవరికి ట్యాగ్ చేశారంటూ నాలుగు ఆప్షన్స్‌గా కపిలి సిబల్, సుబ్రమణ్యన్ స్వామి, అమితావ్ గోష్, శశిథరూర్ పేర్లను ఇచ్చారు. దీనికి గంగూలీ శశిథరూర్ అని సమాధానం చెప్పగా ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

- Advertisement -