24న బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’

35
- Advertisement -

తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అందుకే ఈ నెల 24న ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

పగలూ రాత్రి తేడా లేకుండా..రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం అన్నారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం అన్నారు.

అందుకే గణాంకాలతో సహా.. వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు..అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు.. స్వేద పత్రం రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

Also Read:నయన్ కోసం తీవ్ర పోటీ!

- Advertisement -