మంత్రి జగదీష్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్..

509
ktr
- Advertisement -

మంత్రి జగదీష్ రెడ్డిని పరామర్శించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. జ్వరంతో బాధపడుతున్న జగదీష్ రెడ్డి నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నిమ్స్‌కు చేరుకున్న కేటీఆర్….జగదీష్ ఆరోగ్య పరిస్ధితి అడిగి తెలుసుకున్నారు.

మంత్రి కేటీఆర్‌తో పాటు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్క సుమన్‌, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, టీఆర్‌ఎస్‌ నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాధం తదితరులు జగదీష్‌ రెడ్డిని పరామర్శించారు.

ఇక తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలని సూర్యాపేట మున్సిపాలిటీ పరధిలోని పిల్లలమర్రి గ్రామ టీఆర్ఎస్ నాయకులు స్ధానిక మహాదేవ నామేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -