ఆస్ట్రేలియాలోని అడవుల్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మంటలు గత కొంత కాలంగా అడవి మొత్తం వ్యాపిస్తున్నాయి. అయితే ఆ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా అవి అదుపులోకి రాలేదు. ఈ ఘటనలో ఇప్పటికే అగ్నికీలల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మిలియన్ల సంఖ్యలో జంతువులు చనిపోయాయి. అడవుల్లో విస్తరిస్తున్న మంటల పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా దీనిపై తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. అగ్నికీలలు ఎగిసిపడుతోన్న కారణంగా ఆస్ట్రేలియా మొత్తం ప్రమాదాన్ని ఎదుర్కుంటోందని ఆయన అన్నారు. మంటల్లో లక్షలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం బాధకలిగిస్తుందన్నారు. త్వరలోనే మంటలు అదుపులోకి వస్తాయని.. ఈ కష్ట సమయంలో ఆస్ట్రేలియా శ్రేయస్సు కోసం ప్రార్థిద్దామని ఎంపీ పేర్కొన్నారు.
పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో వాతావరణ సమతుల్యానికి మొక్కల పెంపకం ఎంతో అవసరం అని గుర్తించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి గొప్ప కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఆయన స్పూర్తిగా తీసుకొని ఎంతో మంది తమ వంతుగా మొక్కటు నాటుతున్నారు.
Heartbreaking, is not enough to express my grief, as most of the #Australia is under threat because of wild fire. Agonising to know millions of wild life lost their lives. Hope the fire subsides soon. Let’s pray for the well-being of Aussies.#PreyForAustralia pic.twitter.com/ZaLmGNsvek
— Santosh Kumar J (@MPsantoshtrs) January 8, 2020