ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎలివేటెడ్ కారిడర్లు:కేటీఆర్

258
ktr
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు మంత్రి కేటీఆర్‌. నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్‌ వరకు నిర్మించనున్న కారిడార్‌కు శంకుస్ధాపన చేశారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రూ. 523.37కోట్ల వ్యయంతో నల్గొండ క్రాస్‌రోడ్స్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. 24 నెలల్లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కారిడార్‌ పొడవు 3.382 కిలోమీటర్లు కాగా, ఇందులో ఫ్లై ఓవర్‌ పొడవు 2.580 కిలోమీటర్లు. ఈ ఫ్లై ఓవర్‌పై రెండువైపులా రెండేసి లేన్లలో వాహనాలు ప్రయాణం సాగించవచ్చు.

- Advertisement -