చెత్తకుండీలు లేని నగరంగా హైదరాబాద్‌: కేటీఆర్

193
ktr
- Advertisement -

చెత్తకుండీలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు కేటీఆర్.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో స్వచ్ఛతను, పారిశుధ్యాన్ని ఒక ప్రాధాన్యంగా తీసుకొని 2015లో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు.

ఇప్పటి వరకు 2,500 స్వచ్ఛ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామని….. మరో 650 కొత్త స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఇందులో ఇవాళ 325 ఆటోలను నగరంలో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో మరింత స్వచ్ఛత వసరమన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో సమర్థవంతంగా జీహెచ్‌ఎంసీ పటిష్ట చర్యలు చేపట్టిందని.. మరోసారి ప్రజలను అప్రమత్తం చేస్తూ.. అవసరమైతే మరోసారి స్పెషల్‌ డ్రైవ్ నిర్వహించాలన్నారు.

- Advertisement -